రేణు దేశాయ్... ఈ పేరు వింటేనే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే వీరు దాదాపు పది సంవత్సరాల పాటు సహజీవనం చేసి... ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పవన్ కళ్యాణ్ జీవితంలో కి రెండో భార్య లాగా అడుగుపెట్టిన రేణుదేశాయ్ ఆయని చంచల మనస్తత్వం నచ్చక విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుండి తన పిల్లలను పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంచుతూ పవన్ గురించి ఏరోజు ప్రస్తావించకుండా సోలో గా జీవనం సాగిస్తుంది. అయితే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసిన రోజుల్లో తన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.


బద్రి సినిమాలో ద్వితీయ కథానాయిక నటించిన ఈమె కేవలం నటిగా మాత్రమే మనకు తెలుసు. కానీ ఆమె మాట్లాడుతూ తన లో ఎడిటింగ్ టాలెంట్ కూడా ఉందని వెల్లడించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చాలా సినిమాలకి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించానని ఈమె తెలిపింది. కానీ ఆమె పేరు వెండితెరపై చూపించకపోవడం వలన ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. కేవలం ఎడిటర్ గా మాత్రమే కాదు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పని చేసింది.


పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలోని 'ఏ మేరా జహాన్' అనే పాట మనందరికీ తెలుసు. అయితే ఈ పాటని దర్శకుడు ఎస్.జె సూర్య 20 నిమిషాల పాటు రఫ్ గా షూట్ చేసి ఉంచాడని... 20 నిమిషాల చిత్రీకరణను ఐదు నిమిషాలగా ఎడిట్ చేసేందుకు మార్తాండ్ కె వెంకటేష్ ప్రయత్నిస్తుండగా... ' నాకు హిందీ వచ్చు. నేను ఎడిట్ చేస్తాను. మీరు పక్కకు జరగండి' అంటూ తాను ఆ పాటను అయిదు నిమిషాలకు ఎడిట్ చేసానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.


కానీ ఆమె చేసిన పనికి గాను ఆ సినిమా బృందం గానీ పవన్ కళ్యాణ్ గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం మీరు ఇంత రెమ్యూనరేషన్ చేసుకుంటారా అని అడగకపోవడం తనను బాధించిందని తెలిపింది. పవన్ కళ్యాణ్ మిగతా సినిమాలకు కూడా తన వంతుగా ఎంతో వర్క్ చేశానని కానీ తనకి దక్కింది శూన్యం అని ఆమె తెలిపింది. పవన్ సినిమాలో పనులను ఫ్రీగా చేయడంతో పాటు వెండితెరపై తన పేరు చూపించకపోవడం వలన ఎవరికీ తన టాలెంట్ తెలియలేదని ఆమె తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: