టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ జనాలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా టాక్ ని బట్టి సినిమాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలను చేస్తున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉంటే ఆయన సినిమా విషయంలో కొన్ని కొన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

 

ఆయన సినిమా మీద కొందరు తప్పుడు ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు అని అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఏదో బాలీవుడ్ సినిమాను క్రిష్ పవన్ తో తీస్తున్నాడని అంటున్నారు. ఆ సినిమా బాగుంది కాబట్టి పవన్ కూడా కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను చేయడానికి ఆసక్తి చూపించాడు అనేది టాలీవుడ్ జనాల మాట. కథ ను పవన్ కళ్యాణ్ స్వయంగా కొనుగోలు చేసారని కూడా అంటున్నారు. ఆ కథ క్రిష్ అయితే బాగా తీస్తారు అని భావించే ఇచ్చినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు. 

 

సోషల్ మీడియాలో ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఆయన్ను కొన్ని వర్గాలు ప్రత్యేక౦గా టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళే ఈ సినిమా విషయంలో ఇలాంటి ప్రచారం ఎక్కువగా చేస్తున్నారని సమాచారం. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా అసహనంగానే ఉన్నారు. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. కరోనా కారణంగా సినిమా వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: