ఇప్పుడు భారతీయ సినిమాలో బయోపిక్ లకు మంచి ఆదరణ ఉంది. క్రీడాకారులు సినిమా వాళ్ళు రాజకీయ ప్రముఖుల జీవిత కథలకు మంచి డిమాండ్ ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా వాటిని ఎక్కువగా కోరుకోవడం తో దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మహానటి సినిమాకు మన తెలుగులో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ వచ్చింది. దీనితో ఆమె సినిమాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. 

 

ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది అక్కినేని వారిది అనేది టాలీవుడ్ లో ఇప్పుడు వినపడుతున్న వార్త. అక్కినేని తెలుగు సినిమా మొదటి నుంచి ఉన్నారు. ఆయనను తెలుగు సినిమాకు పిల్లర్ అని అంటు ఉంటారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ని ప్రేక్షకులకు అందించడానికి గాను అక్కినేని ఫ్యామిలీ సిద్దంగా ఉందని నాగార్జున ఈ సినిమాను చెయ్యాలని సుమంత్ ని కోరినట్టు సమాచారం. సుమంత్ కూడా ఈ సినిమా చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్ట జరిగితే ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించే అవకాశం ఉంది. 

 

ఈ సినిమాకు దర్శకుడి గా నాగ్ అశ్విన్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. అతను మహానటి సినిమాను చాలా అందంగా తీసారని ఈ సినిమా కూడా ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఆ ఫ్యామిలీ లో వ్యక్తం అయినట్టు సమాచారం. అందుకే ఈ సినిమాను ఆయన ద్వారా ముందుకి తీసుకుని వెళ్ళాలని సుమంత్ కూడా కోరినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో అందరు హీరోయిన్ లు నటించే అవకాశం ఉంది. దాదాపు పది మంది హీరోయిన్స్ నటిస్తారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: