టాలీవుడ్ లో ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనం కోరుకోవడం ఏమో గాని దర్శక నిర్మాతలు మాత్రం కొత్తరకం సినిమాలను అందించడానికి బాగానే ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఏమీ ఆలోచించకుండా బాలీవుడ్ మాదిరి సినిమా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. దీనితో దర్శక నిర్మాతలు వారి ఆలోచనకు తగిన విధంగా సినిమాలను ఇవ్వడానికి మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు మన తెలుగులో ప్రేక్షకుల ఆలోచన ఏ విధంగా ఉందీ అంటే తమిళ హీరోల మాదిరిగా మన వాళ్ళు సినిమా చెయ్యాలి. అవును తమిళంలో హీరోలు ఏ పాత్ర అయినా సరే చేయడానికి వెనకడుగు వేసే అవకాశం ఉండదు. అందుకే ఇక్కడ కూడా అలాంటి సినిమాలను ఎక్కువగా కోరుతున్నారు ప్రేక్షకులు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చెయ్యాలి అని చూస్తున్నారు. అందుకే దర్శకులు కూడా అదే విధంగా కథలను సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగులో కొత్త రకం సినిమాలకు డిమాండ్ ఉంది. 

 

రంగస్థలం అలా వచ్చిందే... అరవింద సమేత కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు. అల వైకుంఠపురంలో సినిమా పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. కాని ఆ సినిమా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో చేస్తున్నారు. ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ లుక్ తోనే చెప్పేసాడు సుకుమార్. ప్రేక్షకుల ఆలోచన తగిన విధంగా సినిమాలను చేస్తే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది అనేది హీరోల భావన. దాన్ని అర్ధం చేసుకున్న దర్శకులు ఇప్పుడు అదే ప్లాన్ తో సినిమాలను ముందుకి తీసుకుని వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: