కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో మూడు వారాలు పొడిగించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు సెలెబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలీడేస్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్నారు. కొంతమంది దర్శకులు మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని కొత్త కథలు రాసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. వారిలో తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సరిలేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కూడా అదే పనిలో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి లాక్ డౌన్ నేపథ్యంలో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుండటంతో ఇంట్లోనే బందీ అయ్యాడు.

 

కానీ ఆయన హైదరాబాద్ ఇంటి జైల్లో లేదని తెలుస్తోంది. అనిల్ రావిపూడి స్వగ్రామంలోని తన రెండస్తుల ఇంట్లో బందీ అయ్యాడని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చెరుకూరివారి పాలెం గ్రామానికి చెందినవాడు. లాక్ డౌన్ ప్రకటించాక ముందే ఒంగోలు సమీపంలోని తన ఇంటికి చేరుకున్నాడని తెలుస్తోంది. అయితే అతనొక్కడే వెళ్లకుండా తనతో పాటు తన టీమ్ మొతాన్ని తీసుకెళ్లాడట. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కి ఫోన్ ద్వారా ఈ వివరాలను తెలియజేసాడట. అనిల్ రావిపూడి అండ్ టీమ్ కలిసి ప్రస్తుతం 'ఎఫ్3' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట. లాక్ డౌన్ టైములో ఇంట్లోనే స్టోరీ గురించి డిస్కస్ చేసుకుంటూ, ఇంట్లోనే తింటూ ఉండటం బాగుందని చెప్పాడట.

 

అంతేకాకుండా ఎఫ్3 మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ మేనరిజమ్స్.. వెంకీ హాసన్.. అంతేగా అంతేగా లాంటివి కంటిన్యూ అవుతాయని.. ఎఫ్2 కి మించి ఎఫ్3 ఉండబోతోందని చెప్పాడట. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మహేష్ బాబుతో ఈయన మరో సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ ఈ దర్శకుడిని మరో సినిమా చేయమని అడిగిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడు కెరీర్ ప్రారంభించినప్పటి నుండి వరుస విజయాలతో దూసుకెళ్తూ అజేయుడిగా నిలిచాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: