క‌రోనా ఎఫెక్ట్‌తో చాలా మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. బాధ‌ప‌డుతున్న వారికి చాలా మందికి  స‌హాయం చెయ్య‌డానికి సెల‌బ్రెటీలు ముందుకు వ‌చ్చారు. మేము సినిమాల్లో మాత్ర‌మే కాదు బ‌య‌ట కూడా హీరోల‌మే అనిపించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తులో స‌హాయం చేసిన వీరిని చాలా మంది నెటిజ‌న్లు రియ‌ల్ హీరోస్ అంటున్నారు. ఇంత‌కీ ఎవ‌రా అనుకుంటున్నారా... అదేనండీ బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్. ఈయ‌న పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఈయ‌న క‌రోనా ఎఫెక్ట్ పై సీఎం స‌హాయ‌నిధికొర‌కు స్పాట్‌లోనే 25 కోట్లు ఇవ్వ‌డం జ‌రిగింది. అంతేకాక మ‌రోసారి మ‌రో మూడు కోట్ల‌ను అధ‌నంగా ప్ర‌క‌టించారు. అయితే అంతేకాక ఇంకా ఎలాంటి హెల్ప్ కావాల‌న్నా కూడా చేయ‌డానికి నేను ముందున్నా అంటున్నారు ఈ బాలీవుడ్ టాప్ హీరో. అంటే ఎంత ఇచ్చినా కూడా ఈయ‌న‌కు మాత్రం తృప్తి క‌ల‌గ‌డం లేద‌న్న‌మాట‌. ఈ రోజుల్లో ఇంత‌లా స్పందించే వారు ఎవ‌రుంటారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య కాలంలో ఈ హీరో న‌టించే సినిమాల‌న్నీ కూడా హిట్ అనే చెప్పాలి. జాలీ ఎల్ ఎల్ డి 2, టాయిలె, హౌస్‌ఫుల్-4, మిష‌న్ మంగ‌ళ్‌,  ప్యాడ్ మ్యాన్, ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ కూడా సోష‌ల్ ఇష్యూస్ పై ఎక్కువ  సినిమాల్లో న‌టిస్తారు. అయితే  సామాజిక బాధ్య‌త అనేది కేవ‌లం సినిమాల్లోనే కాదు బ‌య‌ట కూడా ఇలానే ఉంటారు అని నిరూపించుకుంటున్నారు.  ఇంత బాధ్య‌త‌గా ఆలోచించే ఏకైక బాలీవుడ్ హీరో  అక్ష‌య్ అని చెప్పాలి. ఇక ప్యాడ్ మ్యాన్ లాంటి చిత్రంలో న‌టించ‌డం అనేది చాలా ఇబ్బందిక‌ర‌మైన స‌బ్జెక్ట్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆ చిత్రంలో న‌టించారంటేనే గ్రేట్ అని చెప్పాలి. అలాగే ఆయ‌న ఎన్నుకునే ఒక్కోపాత్ర కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికీ ఎంతో మంచి సామాజిక విలువ‌లను జోడించి చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: