కరోనా కలకలం లేకపోతే ఈపాటికి పవన్ రీఎంట్రీ మూవీ రెడీ అయి ఉండేది. ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేశాక రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావ‌డంతో వకీల్‌సాబ్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. వాస్త‌వంగా చూస్తే ఈ సినిమా బాలీవుడ్ వెర్ష‌న్‌లో పింక్ సినిమాలో హీరో పాత్రకు హీరోయిన్ లేదు. కానీ తెలుగులో మాత్రం వకీల్ సాబ్ పవన్ కోసం హీరోయిన్ ను సెట్ చేశారు. ఆ మేరకు కథ, స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు. 

 

ఇక హీరోయిన్‌గా కూడా శృతీహాస‌న్‌ను ఫైన‌లైజ్ చేశారు. అయితే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి స‌డెన్‌గా త‌ప్పుకుంది. అయితే ఇప్ప‌పుడు లాక్ డౌన్‌తో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ పోర్షన్ లేకుండానే స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి సినిమాను సిద్ధం చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే ఈ మార్పుల‌కు ప‌వ‌న్ ఒప్పుకుంటాడా ? అన్న‌దే పెద్ద డౌట్‌. హీరోయిన్ లేకుండా ప‌వ‌న్ సినిమాను ప్రేక్ష‌కులు చూస్తారా ? అన్న‌ది సందేహ‌మే. ప‌వ‌న్ కూడా హీరోయిన్ లేక‌పోయినా ఓకే అన్న‌ట్టుగా ఉన్నాడ‌ట‌.. అదే జ‌రిగితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే..?
 

మరింత సమాచారం తెలుసుకోండి: