అలాంటిది ఈ సంవత్సరం రంజాన్  పండగక్కి సల్మాన్ సందడి చేసే ఛాన్స్ లేకపోవడంతో డల్ అయిపోయారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి రంజాన్  ఎప్పుడూ స్పెషలే . ఈ ఫెస్టివల్ సీజన్ లో డబుల్ జోష్ తో  సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.   ప్రతి సంవత్సరం పండక్కి సినిమా రిలీజ్ చేసే ఆ స్టార్ హీరో ఈ సారి  ఆ సందడి చేసే ఛాన్స కనిపించడం లేదు. 

 

బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ భాయ్ రాధా.. ఇప్పుడు కరోనా దెబ్బకి  డిలే అవుతున్నాడు. ప్రతి సంవత్సరం ఈద్ కి సందడి చేసేల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం మిస్ అవుతున్నాడు. గత 10 సంవత్సరాలనుంచి కంటిన్యూయస్ గా రంజాన్ కి సినిమా రిలీజ్ చేసి పండగ హడావిడిని పెంచే ఈ స్టార్ హీరో ఇప్పుడు కరోనా తో ఆ ఛాన్స్ మిస్ అవుతున్నాడు. 


2009 లో రిలీజ్ అయిన వాంటెడ్ సినిమా నుంచి ఈ ఈద్  సెంటి మెంట్ నిఫాలో అవుతున్నాడుసల్మాన్ 2010 లో బ్లాక్ బస్టర్ హిట్ దబంగ్,  2011 లో బాడీ గార్డ్, 2012 లోకత్రినా కైఫ్ తో ఏక్ థా టైగర్ సినిమాలు ఈద్ కి రలీజ్  చేశాడు సల్మాన్.  మళ్లీ 2014 లో సూపర్ హిట్ మూవీ కిక్ , 2015 లో రికార్డులు తిరగరాసిన బజరంగీ భాయ్ జాన్, 2016 లో సుల్తాన్  సినిమాలు కూడా రంజాన్  సీజన్ లోనే  విడుదల చేశాడు.

 

2017  ఈద్ కి ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ చేస్తే..2018 లో భారీ బడ్జెట్ మూవీ రేస్ 3 రిలీజ్ చేశాడు. 2019 లో  భారత్ సినిమా ని ఈద్ కే రిలీజ్ చేసి  బ్లాక్ బస్టర్  హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. 2020 ఈ సంవత్సరం  మే 22 న ఈద్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన  రాధే సినిమా   ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయ్యేఛాన్సుండడంతో ఈద్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు. 

 

ఎందుకంటే ఈ సినిమాకి సంబందించి ఇంకా రెండు పాటలతో పాటు .. ఒక వారం ప్యాచ్ వర్క్ షూటింగ్, ఎడిటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ మిగిలి ఉంది.ఇంకా సినిమాకు సంబందించి పనలు మిగిలి ఉండడంతో పాటు ..అసలు ఈ కరోనా ఎప్పుడు పోతుందో, లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో అన్నదాని మీద ఇప్పటివరకూ ఎలాంటి న్యూస్ లేకపోవడంతో సినిమా  మే 22 ఈద్ కి రావడం కష్టమే  అనుకుంటున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: