పై ఫోటోలో కనిపిస్తున్న నలుగురు ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వారే. వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీ డేస్ సినిమాలో చాలా క్యూట్ గా కనిపించి కుర్రకారు మతులు పొగగొట్టేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలిసారిగా లక్ష్మీ కళ్యాణం సినిమా లో హీరో తారక రామ్ సరసన నటించిన కాజల్ అగర్వాల్... ఆర్య సినిమా ద్వారా తన అందచందాలతో కోట్ల మంది యువకుల హృదయాలను కొల్లగొట్టేసింది. సమంత అక్కినేని maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా ద్వారా అందర్నీ టీవీలకు కట్టిపడేసింది. దూకుడు సినిమాలో కూడా ఈమె నటించి తన అందానికి ఎవరు సాటిరాలేరని చెప్పకనే చెప్పేసింది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తెలుగు సినిమాలు అన్ని డిజాస్టర్ గా మిగిలిపోయినప్పటికీ... ఆమె అందానికి చాలా మంది యువకులు ఫిదా అయిపోయారు.


ఈ నలుగురు హీరోయిన్లు చాలా చిన్న సినిమాలతో సినీ రంగప్రవేశం చేసినప్పటికీ... ప్రస్తుతం మాత్రం చాలా పెద్ద ప్రాజెక్టులలో నటిస్తూ ఈ దశాబ్దంలో టాప్ కథానాయకిల్లాగా నిలుస్తున్నారు. సమంత అక్కినేని లేడి ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ సౌత్ ఇండస్ట్రీ లో దూసుకెళ్తుండగా... తమన్నా బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా తన అందచందాలతో తమిళ హిందీ తెలుగు చిత్రాలలో చాలా బిజీగా ఉంది. సమంత అక్కినేని గేమ్ ఓవర్ చిత్ర దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతోంది.


అయితే ఇంతకీ ఈ నలుగురు ఒకే సారి ఒకే ఫ్రేమ్ లో ఫోటో దిగిన సందర్భం గురించి మాట్లాడుకుంటే... గత సంవత్సరం మార్చి 8వ తేదీన క్యాప్టెన్ మార్వెల్ విడుదలయింది. అయితే మార్చి ఒకటవ తేదీ నాడు క్యాప్టెన్ మార్వెల్ చిత్రబృందం హైదరాబాద్ నగరంలో ప్రెస్ మీట్ నిర్వహించగా... ఆ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ అయినా కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ సమంత పాల్గొని ప్రేక్షకులకు కన్నుల విందు అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: