కరోనా వైరస్ కారణంగా కేంద్రం... దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఇళ్ల కే పరిమితం అయిపోయారు. చాలామంది అభిమానులతో లైవ్ లో అందుబాటులో ఉంటూ అనేక విషయాలు చెబుతుంటే...మరి కొంతమంది తాము ఏం చేస్తున్నారు వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వంట వంటతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సమయంలో వరుస విజయాలు సాధించిన డైరెక్టర్ శ్రీనువైట్ల కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. చేసిన ప్రతి సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో పాటు..శ్రీను వైట్ల తో సినిమా అంటే స్టార్ హీరోలు వెనక్కి వెళ్ళి పోతున్నారు.

 

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో ప్రస్తుతం మంచు విష్ణుతో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వాళ్ళ తో చేసిన శ్రీను వైట్ల కి ప్రస్తుతం అవకాశాలు దొరకక పోవడంతో.. చాలావరకూ శ్రీనువైట్ల ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దుకుని టైం వచ్చేసింది అని చాలామంది సినిమా ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

 

ఇటువంటి టైములో శ్రీను వైట్ల భార్య.. రూప వైట్ల సోషల్ మీడియాలో వంటలు వండుతూ వీడియోలు చేయడంతో చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. శ్రీను వైట్ల నెక్స్ట్ సినిమా ఎవరితో అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఆఖరికి వంటలు వండుతున్నారా..? ఇంకెప్పుడూ సినిమా హిట్ కొడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: