టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబాలి రెండు సినిమాల సూపర్ సక్సెస్ తరువాత హీరోగా తన క్రేజ్ బాగా పెంచుకోవడంతో పాటు మరింత గొప్ప మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆ తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ సాహో లో నటించిన ప్రభాస్, ప్రస్తుతం జిల్ మూవీ దర్శకడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

 

జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ రిట్రో బ్యాక్ డ్రాప్ స్టోరీ లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా కృష్ణంరాజు ఒక కీలక పాత్రలోను, అలానే నాటి బాలీవుడ్ మూవీ ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ, ప్రభాస్ కు తల్లిగా యాక్ట్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ విషయం అటుంచితే దీని అనంతరం యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా స్టోరీ, సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఉండనుందని తాజా సమాచారం. 

 

టైం ట్రావెల్ కథ మాదిరిగా పలు ప్రత్యేక కాలాలకు సంబంధించి ఈ సినిమా కథ సాగుతుందని, దీనికి సంబంధించి అశ్విన్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని చాలావరకు సిద్ధం చేసారని, అయితే మధ్యలో అక్కడక్కడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటే, ప్రస్తుతం వాటిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ముందుగా అనుకున్న విధంగానే తాను నటిస్తున్న ప్రస్తుత సినిమాని ఎట్టిపరిస్థితుల్లో దసరాకల్లా పూర్తి చేసి, ఆపై డిసెంబర్ లో అశ్విన్ సినిమాలో నటించాలని భావిస్తున్నారట ప్రభాస్. మరి రెండేళ్ల క్రితం కీర్తి సురేష్ తో మహానటి తీసి గొప్ప విజయాన్ని అందుకున్న అశ్విన్, ప్రభాస్ కు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తారో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: