సిని  సెలబ్రిటీలు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఊపిరి సలపనంత  బిజీగా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు డే అండ్ నైట్ షూటింగులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు బిజీ బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు అందరూ ప్రస్తుత ఇంటికే పరిమితమయ్యారు. భారత్ లో  రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు... కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ సెలెబ్రిటీలు  అందరూ ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో... హాయిగా ఫ్యామిలీతో గడుపుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇంట్లో ఉండి కరోనా  వైరస్ తో పోరాటం చేస్తున్నారు. 

 


 ఈ క్రమంలోనే ఇంట్లో ఉండి బోర్ కొట్టిన చాలా మంది సెలబ్రెటీలు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన కత్రినా కైఫ్ తన గదిని తాను ఉడ్చటం... వంట నేర్చుకోవడం లాంటివి చేస్తుంది... మరికొంతమంది కూడా ఇలా వంటగదిలో సమయాన్ని గడుపుతున్నారు సెలెబ్రిటీలు . క్రికెట్ లో ఎంతో క్రేజ్ ఉన్న శిఖర్ ధావన్ కూడా ఇంట్లో అంట్లు తోముతు  కనిపించడం. ఇలా చాలా మంది లాక్ డౌన్  సమయాన్ని సరదాగా గడిపేందుకు తమ  భాగస్వాములకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. 

 


 ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు రామ్ చరణ్. కాగా  ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా  ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. దీంతో రామ్ చరణ్  ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఇంకేముంది ఖాళీ టైంలో తన సతీమణి ఉపాసన కు ఒక స్పెషల్ డిష్ వండి  పెడుతున్నాడు రామ్ చరణ్. దీని కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: