ఈ మద్య టాలీవుడ్ లో బాలీవుడ్ భామలు మంచి సత్తా చాటుతున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీమణులు తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగుతూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుగు తెరకు పరచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ.  ధోనీ బయోపిక్ లో సాక్షి సింగ్ ధోనీ పాత్రకు గానూ అవార్డులను అందుకుంది కైరా. అలా క్యూట్ కమ్ రియల్ లుక్స్ తో ఆకట్టుకున్న కైరా ఇప్పుడు గ్లామర్ అవతారం ఎత్తింది.  గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తరువాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 

ఆ తరువాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. సినిమా మాత్రం హిట్ కాలేదు.  దాంతో ఇక బాలీవుడ్ బెటర్ అనుకొని అక్కడే స్థిరపడిపోయింది.  తెలుగు లో పలు ఛాన్సులు వచ్చినా పట్టించుకోవడం లేదని.. ఒకవేళ నటించాలన్నా రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తుందని గత కొంత కాలంగా వార్తలు తెగ వస్తున్నాయి.  తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం కాస్త ఈ బ్యూటీ వద్దకు వెళ్లింది.. దాంతో దీనిపై స్పందించిన కైరా తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.

 

అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను.  నేను ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నానని వార్తలు వస్తున్నాయి.. దయచేసి వాటిని నమ్మోద్దు.. తెలుగులో కథ .. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు అంటూ స్పష్టత ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: