మహేష్ బాబు పుట్టింది మద్రాస్. చదువుకున్నది కూడా అక్కడే. ఆయన హీరో అయ్యేంతవరకూ అక్కడే చదివాడు. ఆ విషయం తన ఇంటర్వ్యూలల్లో కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక మహేష్ తమిళం బాగా మాట్లాడుతారు. ఆయన స్ట్రైట్ గా కోలీవుడ్ లో మూవీ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది.

 

సరే ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు 27వ మూవీకి రంగం సిధ్ధం అవుతోంది. ఈ మూవీని గీతా గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. కధ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా ముంబాయి భామ అనుకున్నారు కానీ ఇపుడు మాత్రం కీర్తీ సురేష్ అంటున్నారు.

 

సరే హీరో హీరోయిన్లు రెడీ. కానీ విలన్ ఎవరు, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ని ఢీ కొట్టే సత్తా ఉన్న ఆ  పవర్ ఫుల్ విలన్ ఎవరు అంటే ఆ న్యూస్ కూడా మెల్లగా బయటకు వస్తోంది. ఈ మూవీలో విలన్ గా అరవింద స్వామి కనిపిస్తారట.

 

తమిళనాడుకు చెందిన ఒకనాటి హీరో, అందలా నటుడు అరవింద స్వామికి తెలుగులో అప్పట్లో లేడీ ఫాలోయింగ్ బాగా ఉందన్న సంగతి తెలిసిందే. అరవింద స్వామీ హీరో నుంచి ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆయన రాం చరణ్ మూవీలో విలన్ గా వేసి చాలా మంచి మార్కులు కొట్టేసారు. 

 

విలన్ కూడా ఇంత అందంగా ఉంటాడా అనిపించేలా అరవిందస్వామి తన స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టేశారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ లాంటి అందగాడి పక్కన ఇంతవరకూ అందమైన భామలనే చూశారు కానీ ఇపుడు అందమైన విలన్ కూడా జత అవుతూందడంతో ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. అన్నట్లు సూపర్ స్టార్ క్రిష్ణ బర్త్ డే వేళ ఈ మూవీ స్టార్ట్ అవుతుందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: