దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలందరూ లాక్ డౌన్  విజయవంతంగా పాటిస్తున్నారు. దాదాపు అందరు  ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దీంతో  రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సమయంలో అన్ని సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు సినిమాల్లో మంచి వాళ్ళు గా కనిపించే సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో రియల్ లైఫ్ లో కూడా తన మంచి మనసు చాటుకుంటున్నారు .

 

 

 కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనిస్తూ విరాళాలను అందజేస్తున్నారు ఎంతో మంది సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు. దేశంలో ఏ ఆపద వచ్చినా అక్షయ్ కుమార్ చేయూత అందించేందుకు ముందుకు వస్తారు.  ఈ క్రమంలోనే మరోసారి తన పెద్ద మనసు చాటుకుని  25 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

 

 

 ఎప్పుడు తన సినిమాలతో ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తూ ... అద్భుత విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ కుమార్. అయితే సినిమాల్లో హీరోయిజం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు...  దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చి నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఇక అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేయడంతో అక్షయ్ కుమార్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఏ సెలబ్రిటీ కూడా ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: