బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రన్ బీర్ కపూర్ అనేక విజయాలు సాధిస్తూ కెరియర్ చాలా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించిన రన్ బీర్ కపూర్ బీ టౌన్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో పెద్ద హాట్ టాపిక్ గా నిలుస్తాడు. తాజాగా రన్ బీర్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో ఫుల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అంతే కాకుండా రెండు కుటుంబాలు కూడా మాట్లాడుకున్నట్లు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత పెళ్లి గురించి కొత్త వార్త వినబడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదే టైమ్ లో సోషల్ మీడియా లో టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ వార్తలకు బలం ఇచ్చే విధంగా పోస్టు పెట్టింది.

 

ఇదిలా ఉండగా అలియా భట్ గతంలో రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కేక్ తయారుచేసి...రన్ బీర్ కపూర్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమైన వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఆలియాభట్ పుట్టినరోజు నాడు రన్ బీర్ కపూర్ కేక్ తయారు చేయించి...గిఫ్ట్ గా ఇచ్చినట్లు తాజాగా ఈ విషయం బయటపడింది. ఈ కేక్ నీ తయారు చేసిన హర్ష అనే చెఫ్ బయట పెట్టాడు. ఇటీవల ఈ హర్ష అనే చెఫ్ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది.

 

అయితే ఇదే తరుణంలో కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో అన్ని సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి టైం లో అన్నీ ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు ఎవరికి వాళ్ళు తమ ఇళ్ళల్లో కుటుంబ సభ్యులతో గడుపుతుంటే...రన్ బీర్ మరియు ఆలియాభట్ మాత్రం రన్ బీర్ ఇంటిలో ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల బయటకు వచ్చింది. లాక్ డౌన్ టైం లో కూడా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉండటంతో త్వరలో వీళ్ళ పెళ్లి కన్ఫామ్ అయిపోయినట్లే అని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: