సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు సంవత్సరాల నుండి వరుసపెట్టి విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో అదిరిపోయే విజయాన్ని సంక్రాంతి పండుగ నాడు తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం తో పాటుగా మహేష్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాన్ని మహేష్ బాబు నమోదు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో అనుకున్నా అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు.ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ ఒక్కసారిగా రావడంతో దేశంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయాయి. ఇటువంటి తరుణంలో ఎవరికి వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు హీరోయిన్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు తమ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొంతమంది వంటలు వార్పులు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.

 

ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు తన కొడుకు గౌతం తో దిగిన చిన్ననాటి ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ఫోటో చూసిన చాలా మంది సెలబ్రెటీలు మరియు అభిమానులు లైక్ ల మీద లైకులు కొడుతున్నారు. అంతే కాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదిలావుండగా దేశంలో లాక్ డౌన్ ఎత్హేసినా వెంటనే పరుశురాం సినిమా స్టార్ట్ చేసి వీలైతే ఎంత త్వరగా మొదలైతే అంత త్వరగా సినిమా విడుదల చేయూలని మహేష్ ఆలోచన చేస్తున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: