శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన 'ప్రస్థానం' సినిమా విడుదలై పదేళ్లు అవుతోంది. ఒక డైరెక్టర్ పది కాలాల పాటు గుర్తుండి పోవాలంటే వందల కొద్ది సినిమాలు చేయాల్సిన పని లేదు. ఒకే ఒక్క మంచి చిత్రం తీసినా చాలు. అలా ప్రేక్షకులకు గుర్తుండి పోయిన దర్శకుడే దేవా కట్ట అని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు థియేటర్లలో చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులని వెంటాడుతూనే ఉంటాయి. ఆ సినిమాల్లోని క్యారెక్టర్స్ నిజ జీవితంలో మనం చూస్తున్న పాత్రలలాగే అనిపిస్తుంటాయి. ఆ పాత్రలు.. సంభాషణలు.. వారి మధ్య జరిగే సంఘర్షణల నుండి బయటకి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి అరుదైన చిత్రాలు మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి 'ప్రస్థానం' సినిమా అని చెప్పుకోవచ్చు. దేవాకట్టా ఎప్పటికీ నిలిచిపోయే 'ప్రస్థానం' అనే సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకి అందించాడని చెప్పవచ్చు. పదేళ్లయినా మనం ఇంకా ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నామంటే 'ప్రస్థానం' ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అయింది. 

 

ఈ సందర్భంగా డైరెక్టర్ దేవాకట్ట సోషల్ మీడియాలో ప్రస్థానం జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. 'పదేళ్లైనా కూడా ప్రస్థానం చిత్రాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు.. మరో గొప్ప చిత్రాన్ని అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నానంటే.. దానికి మీరిచ్చే ప్రశంసలు, మీరు పెట్టుకున్న అంచనాలే కారణం. నేను తదుపరి చేయబోయే సాయి ధరమ్ తేజ్ చిత్రానికి అవే నా బలం' అని ట్వీట్ చేసాడు. వాస్తవానికి వెన్నెల, ప్రస్థానం సినిమాల తర్వాత దేవా కట్టా నుండి ఆ స్థాయిలో మరో సినిమా రాలేదనే చెప్పవచ్చు. ఎన్నో అంచనాలతో తీసిన 'ఆటోనగర్ సూర్య' విడుదల కావడానికే నానా అవస్థలు పడింది. సినిమా రిలీజ్ లేట్ అవడంతో ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతోనైనా దేవా కట్ట స్టార్ డైరెక్టరుగా ఎదుగుతాడేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: