సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రం
టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాల్గో
సినిమా గా రికార్డు సృష్టించింది.
అల్లు అర్జున్ నటించిన అల .. వైకుంఠపురముతో బాక్సాఫీస్ వద్ద హోరాహోరి గా తలపడి చాలా ఏరియాల్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టి
సరిలేరు నీకెవ్వరు సత్తా చాటింది.
ఇక ఇటీవల ఈ చిత్రం
సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ ను సైతం ఊపేసింది. ఉగాది కానుకగా ఈ సినిమాను
జెమిని టీవి మొదటి సారి ప్రసారం చేయగా ఏకంగా 23.3 టీఆర్పీ రాబట్టి అత్యధిక టీఆర్పీ రాబట్టిన మొదటి సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ప్రసారం విషయంలో మాత్రం వీక్షకులనుండి చాలా కంప్లైట్స్ వచ్చాయి. వీడియో క్వాలిటీ తగ్గించి సీన్లు కట్ చేసుకుంటూ ఈసినిమాను ప్లే చేశారు. దాంతో జనాలకు ఒరిజినల్ ప్రింట్ ను చూస్తున్నామా లేక పైరసీ ని చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగింది.
ఇక ఇప్పుడు ఈసినిమాను రెండో సారి ప్రసారం చేయడానికి రెడీ అయిపోయింది జెమిని టీవి. ఈనెల 26న సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుండగా ఈసారి మాత్రం హెచ్ డి క్వాలిటీ తో సీన్లు కట్ చేయకుండా ప్రదర్శిస్తామని జెమిని తెలిపింది. ఈచిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైయింది. ఇక ఈ చిత్రం తరువాత
మహేష్ బాబు ,
గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ తో
సినిమా చేయనున్నాడు. ప్రస్థుతం ప్రీప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి
మూవీ మేకర్స్ నిర్మించనుంది. మే 31 న ఈ చిత్రం లాంచ్ కానుందని సమాచారం.