సామాజిక అంశంతో సామాజిక దృక్పథంతో సినిమాలు తీసి చరిత్ర సృష్టించిన దర్శకుడు శంకర్. సామాజిక అంశాన్ని అంతర్గతంగా చెబుతూనే పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు తెరకెక్కిస్తూ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికి సక్సస్ లు మాత్రం చాలా ఎక్కువే. హీరో ఎవరైనా ఆయన మేకింగ్ స్టైల్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అసలు పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కూడా శంకర్ స్క్రీన్ ప్లే ని కాని ఆయన మేకింగ్ స్టైల్ ని కాని ఫాలో అవ్వాలంటే అసాధ్యం. 

 

ఇక శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు, హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకు కారణం ఆయన ఇచ్చే సోషల్ మెసేజ్ అండ్ మేకింగ్ స్టైల్. దీనికంటే కూడా కొత్తగా ఏ టెక్నికల్ వాల్యూస్ చూపించారు అని ఒక క్యూరియాసిటీతో ఉంటారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు.  కాని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అవాంతరాలు వెంటాడుతున్నాయి. 'ఇండియన్ 2' రెగ్యులర్ షూటింగ్ మొదలైన తర్వాత మధ్యలో ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. 

 

అయితే 'ఇండియన్ 2' ఆగిపోలేదని కమల్ హాసన్ శంకర్ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత 'క్షత్రియ పుత్రుడు', 'శభాష్ నాయుడు' సినిమాలు కూడా పూర్తి చేస్తానని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. ఇక 'ఇండియన్ 2' సినిమాని 'భారతీయుడు 2' గాను తెలుగులో రిలీజ్ చేస్తుండగా కమల్ హాసన్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే ఒక పెద్ద దెబ్బ అయితే ఇప్పుడు ఈ సినిమా కి కరోనా కష్టాలు చుట్టు ముట్టాయి. దీంతో ఈ సినిమా ఉంటుందా లేక మేకర్స్ డ్రాపవుతారా అని కోలీవుడ్ లో చర్చ మొదలైందట.

మరింత సమాచారం తెలుసుకోండి: