మహేష్ కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ అంటే అందరు చెప్పేది ఒక్కడు గురించే.. అంతకుముందు రాజకుమారుడు, మురారి సినిమాలు వచ్చినా మహేష్ జెనరల్ ఆడియెన్స్, యువతకు మెచ్చేలా చేసింది మాత్రం ఒక్కడు సినిమానే. ఆ సినిమాతో మహేష్ కు మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇదిలాఉంటే గుణశేఖర్ డైరక్షన్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎం.ఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన ఒక్కడు సినిమా సంచలన విజయం అందుకుంది. 

 

మహేష్ సరసన భూమిక హీరోయిన్ గా నటించగా సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించారు. ఒక్కడు విలన్ గా ఓబుల్ రెడ్డి పాత్రను ముందు గోపీచంద్ చేత చేయించాలని అనుకున్నారు. దర్శక నిర్మాతలు ఓబుల్ రెడ్డిగా గోపీచంద్ కు ఛాన్స్ ఇద్దామని అడుగగా.. ఎందుకో వద్దని చెప్పాడట. మహేష్ వద్దని చెప్పడంతో ప్రకాష్ ర ను ఓబుల్ రెడ్డి పాత్రకు సెలెక్ట్ చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఓబుల్ రెడ్డి పాత్రలోని అన్ని షేడ్స్ లో ప్రకాష్ రాజ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 

 

ఒక్కడు సినిమా అటు మహేష్, ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరి కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు కెరియర్ కమర్షియల్ పంథాలో సాగించేలా చేసిన సినిమా ఒక్కడు. అందుకే ఆయన కెరియర్ లో ఒక్కడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకవేళ ఒక్కడు ఓబుల్ రెడ్డి పాత్ర గోపీచంద్ చేస్తే ఎలా ఉండేదో కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఆ పాత్రకు న్యాయం చేశారు. ఒక్కడులో గోపీచంద్ ను వద్దని చెప్పిన మహేష్ తేజ డైరక్షన్ లో చేసిన నిజం సినిమాలో అతన్ని విలన్ గా ఓకే చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకవేళ గోపీచంద్ ఒక్కడు సినిమా చేసినా ఫలితం ఇలానే ఉండేదేమో.. విలన్ గా అలరించిన గోపీచంద్ మళ్ళీ హీరోగా మారి సక్సెస్ అందుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: