ఒక భాషలో హిట్ అయిన సినిమాను మిగతా భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం అయ్యింది. తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఈమధ్య మళయాళ సినిమాల మీద టాలీవుడ్ మేకర్స్ కన్ను పడ్డది. అక్కడ వరుసగా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా అక్కడ రిలీజై హిట్ అందుకున్న అయ్యప్పనమ్ కోషియం సినిమాను తెలుగు రీమేక్ ప్రయాత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ, రానా, వెంకటేష్, రవితేజ ఇలా ఒక్కొక్కరు ఒక్కో కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందని చెప్పుకుంటున్నారు. 

 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఇప్పటికే ఆ సినిమా రైట్స్ కొనగా.. ఇద్దరు డైరక్టర్స్ ను ఈ రీమేక్ కోసం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరు ఓకే అంటే వారితో ఈ రీమేక్ మూవీ చేస్తారట. అందులో ఒకరు సుధీర్ వర్మ కాగా మరొకరు  తిన్ననూరి. సినిమా మేకింగ్ బాగుంటున్నాయి సరైన కంటెంట్ దొరక్క ఇబ్బంది పడుతున్న సుధీర్ వర్మకు మళయాళ సూపర్ హిట్ సినిమా బాధ్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన కుదరకపోతే జెర్సీ సినిమాతో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరితో ఈ రీమేక్ చేస్తారని తెలుస్తుంది. 

 

సుధీర్ వర్మ, గౌతమ్ తిన్ననూరి ఈ ఇద్దరిలో ఎవరైనా సరే ఆ ప్రాజెక్ట్ కు న్యాయం జరిగినట్టే అని చెప్పొచ్చు. ఇక మళయాళ సినిమా అయ్యప్పనం కోషియం సినిమా విషయానికి వస్తే పృథ్వి రాజ్, బిజ్జు మీనన్, గౌరి నంద లేదు రోల్స్ లో నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. కంటెంట్ బాగుండటంతో ఆ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని ఆరాటపడుతున్నారు టాలీవుడ్ మేకర్స్. మరి ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయక తప్పదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: