కరోనా అందరి మధ్య దూరం పెంచేస్తోంది. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకు తిరిగిన ప్రాణ స్నేహితులు కూడా ఇప్పుడు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లిస్ట్ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ ఎప్పుడు కలిసి పార్టీలు చేసుకునే గ్యాంగ్స్ చాలానే ఉన్నాయి. అందులో స్పెషల్గా చెప్పుకునే గర్ల్స్ గ్యాంగ్ కూడా ఒకటి ఉంది.
కరీనా కపూర్, కరీష్మా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరాలు మంచి స్నేహితులు. జిమ్కు వెళ్లినా, షాపింగ్ కు వెళ్లినా.. పార్టీలకైనా పబ్లకైనా ఈ నలుగురు కలిసే వెళతారు. అయితే ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఈ నలుగురు ఎవరి ఇంట్లో వారు ఉండిపోయారు. ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేదు. లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత కూడా దగ్గర కలిసి తిరిగే పరిస్థితి లేదు. దీంతో కరీనా కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో తన గర్ల్స్ గ్యాంగ్ ఫోటోను పోస్ట్ చేసిన కరీనా కపూర్ వాళ్లను తెగ మిస్ అవుతున్నా అని బాధపడింది. ఇన్నాళ్లు నలుగురికి ఒక్క టేబుల్ తీసుకునే వాళ్లం ఇప్పుడు నలుగురికి నాలుగు టేబుల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. వాళ్లకు దూరంగా ఉండలేను` అంటూ పోస్ట్ చేసింది కరీనా కపూర్.