టాలీవుడ్ లో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఆమె తో సినిమా చేయడానికి ఎక్కువగా ఇప్పుడు హీరోలు దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. పూజ కూడా ఇందుకే రేటు ని భారీగా పెంచింది అనే టాక్ వినపడుతుంది. ఇక ఇప్పుడు ఆమెకు తెలుగులో భారీ ప్రాజెక్ట్ ఓకే అయింది అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను మరో స్టార్ హీరో తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. 

 

అది ప్రేమ తో పాటుగా యాక్షన్ సినిమా కూడా. ఆ సినిమాలో ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దాదాపు 200 కోట్ల తో ఆ ప్రాజెక్ట్ ని చేసే సూచనలు కనపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు రామ్ చరణ్ అని అంటున్నారు. టాలీవుడ్ జనాలకు రామ్ చరణ్ సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి పెరిగింది ఇప్పుడు. అందుకే అతను సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాడు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు పూజ కు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ జనాలు కూడా ఆమెను హీరోయిన్ గా రావాలి అనుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఆమె అక్కడి సినిమాలను కూడా ఓకే చేస్తుంది అంటున్నారు. అందుకోసం అవసరం అయితే తెలుగు సినిమాలను పక్కన పెట్టే ఆలోచనలో పూజ ఉందని జనాల టాక్. ఆమె సల్మాన్ ఖాన్ తో సహా మరో ఇద్దరు హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: