కరోనా క్వారెంటైన్ కారణంగా ప్రపంచమంతా నాలుగు గోడల మద్య ఇరుక్కుపోయింది. వీళ్లు వాళ్లు అన్న తేడా లేకుండా అంతా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ చూడని ఈ విత్కర పరిస్థితులలో కొంత మంది భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుక వినియోగించుకుంటున్నారు. హాట్ బ్యూటీ సన్నిలియోన్ తన అభిమానులు క్వారెంటైన్లో ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తోంది.
ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న సన్ని తన పాత ఫోటో షూట్ స్టిల్స్ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. డబూ రత్నాని తీసిన పలు హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది సన్నీ. బికినీల్లో బీచ్ ఒడ్డున తీసిన ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కష్టకాలంలోనూ తన అందాలతో అభిమానులు ఎంటర్టైన్ చేస్తోంది హాట్ బ్యూటీ.
భారతీయ మహిళ కాకపోయిన తన వంతుగా భారత ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాల్లో భాగం పంచుకుంటుంది సన్నీ. ప్రధాని మోదీ పిలుపు మేరకు చప్పట్లు కొట్టడంతో పాటు, దీపాలు వెలిగించి తన వంతుగా సంఘీభావం తెలిపింది సన్నిలియోన్.