టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష. ఆమె తో అగ్ర హీరోలు కూడా సినిమాలు చేసారు. చిరంజీవి మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమె కూడా తెలుగులో ఫాన్స్ ని పెంచుకుంది. నాగార్జున తో ఆమె చేసిన కింగ్ సినిమా ఆమె కెరీర్ లో ఫ్లాప్ అయినా సరే ఆమెకు నటిగా మంచి పేరు తీసుకుని వచ్చింది అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తెలుగు సినిమాల్లో ఆమెను అసలు వద్దని అంటున్నారట. 

 

చిరంజీవి సినిమాను ఆమె ఓకే చేసినట్టే చేసి కాదు అని చెప్పినట్టు సమాచారం. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో చాలా సీరియస్ గా ఉన్నారు జనాలు అని అంటున్నారు. వెంకటేష్ సినిమాలో ఆమెను తీసుకోవాలని చూసినా సరే కొన్ని కారణాలతో పక్కన పెట్టారని అంటున్నారు. ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం వద్దని వెనక్కు తగ్గింది అంటున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు ఆఫర్లు వచ్చినా తమిళంలో తనకు ఎక్కువ డిమాండ్ ఉందని అక్కడ ఎక్కువగా ఇస్తున్నారని ఆమె చెప్పినట్టు సమాచారం. 

 

ఇక నిర్మాతలు కూడా ఆమె కోరికలను తాము తీర్చే పరిస్థితిలో ఇప్పుడు లేము అని భావించి ఆమెను పక్కన పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ జనాలకు త్రిష బాగా దగ్గర అయినా సరే ఆమెను వద్దు అని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇప్పుడు తమిళంలో ఆమె మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అక్కడి హీరోయిన్ లు కూడా ఆమెకు పోటీ ఇచ్చే పరిస్థితి అసలు లేదని సమాచారం. అందుకే ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: