కరోనా వైరస్ ఏమో గాని ఇప్పుడు కొందరు నిర్మాతలకు ఇది తల నొప్పిగా మారింది. కరోనా వైరస్ దెబ్బకు చాలా సినిమాలను విడుదల చేయడం మానేశారు కొన్ని సినిమాలను షూట్ చేయడం కూడా దాదాపుగా మానేసిన సంగతి తెలిసిందే. ఇక చిన్న చిన్న పనులను చిత్ర నిర్మాతలు దర్శకులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి అదే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని బాలీవుడ్ కూడా చూస్తుంది. 

 

ఇక ఈ సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ అయింది. ఇక వాటిని ఎడిట్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. ఈ క్రమంలోనే రాజమౌళి ఎన్నో జాగ్రత్తల్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికి కూడా వీడియో లను షేర్ చేయడం గాని ఎవరికి కూడా పక్కన లేకపోతే హార్డ్ డిస్క్ లను ఇవ్వడం గాని ఆయన చేయడం లేదని అంటున్నారు. తనకు బాగా నమ్మకస్తులు అయితే మినహా ఇవ్వొద్దు అని భావిస్తున్నట్టు సమాచారం. చిన్న సీన్ లీక్ అయిన సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. 

 

అందుకే రాజమౌళి ఇప్పుడు భయపడుతున్నారు. చిన్న తేడా వచ్చినా సరే ఇబ్బంది పదాలని భావించి ఎవరికి కూడా ఈ ఒక్కటి కూడా షేర్ చేయవద్దు అనుకుంటున్నారు అని తెలుస్తుంది. ఎం చెయ్యాలి అన్నా సరే సినిమాకు సంబంధించి తన ఇంటికే రావాలని అది ఎవరు అయినా సరే అని ఆయన స్పష్టం చేసారట. హీరోలకు మాత్రమే డబ్బింగ్ కి సంబంధించి కొన్ని సీన్లను ఆయన పంపినట్టు తెలుస్తుంది. చిన్న సీన్ కూడా ఇవ్వకపోవడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: