కోవిడ్ ౧౯ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. చైనాలో మొదలై ప్రపంచానికంతా విస్తరించి మనుషుల ప్రాణాలని గాలిబుడగలుగా మార్చేస్తుంది. ఈ వైరస్ బారినుండి మనల్ని మనం రక్షించుకోవడానికి లాక్డౌన్ ఒక్కటే సరైన ఆయుధమని ప్రపంచ దేశాలన్నింటిలో చాలా దేశాలు లాక్డౌన్ ని పాటిస్తున్నాయి. అయితే లాక్డౌన్ టైమ్ లో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకి దగ్గర అవుతున్నారు.

 

 

సోషల్ మీడియా ద్వారా ఛాలెంజిలను ఎదుటివారికి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కరోనా నుండి కాపాడుకోవడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్న ఉద్దేశ్యంతో సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ బాగా ట్రెండింగ్ లో నడిచింది.అయితే లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోవడంతో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనల రూపమే పిల్లో ఛాలెంజ్. సినిమా హీరోయిన్లు ఈ ఛాలెంజిని స్వీకరిస్తున్నారు.

 

 

పిల్లో ఛాలెంజ్ అంటే శరీరంపై ఏమీ వేసుకోకుండా కేవలం పిల్లోని చుట్టుకుని అందాలని కవర్ చేసుకోవడమే. హాలీవుడ్ నుండి మొదలైన ఈ ఛాలెంజి టాలీవుడ్ కి కూడా చేరింది. ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారు మతి పోగొట్టిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ పిల్లో ఛాలెంజిని స్వీకరించింది. పసుపుపచ్చ దిండుని తన శరీరానికి చుట్టుకుని నడుముకి బెల్టు పెట్టుకుని, కురుచ కురులతో, మత్తెక్కించే కళ్లతో, చూపుతిప్పుకోలేని అందంతో ఫోటోకి ఫోజిచ్చింది. 

 

 

అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోకి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు పాయల్ అందాలను చూసి మురిసిపోతుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంకొంచెం క్రియేటివ్ గా ఆలోచించచ్చుగా అని సలహా ఇస్తున్నారు. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ ఇలాంటి ఛాలెంజిలు స్వీకరించి మరింత బోల్డ్ గా తయారయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: