టాలీవుడ్ లోకి కొంత కాలంగా మాలీవుడ్, బాలీవుడ్, కన్నడ బ్యూటీలు హీరోయిన్లు వస్తున్నారు. ఆ మద్య నాగశౌర్య నటించిన ఛలో సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.  మొదటి సినిమా మంచి సక్సెస్ అయ్యింది.  తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీతాగోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ కావడమే కాదు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో నిలిచింది.  అప్పటి నుంచి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంటుంది.  ఈ ఏడాది మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మరో సంచలన విషయం అందుకుంది.తొలి సినిమాతోనే తానేమిటో తెలుగువారికి రుచిచూపించింది రష్మిక.

 

మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే ఎత్తు కొద్దిగా తక్కువే అయినా అది ఆమె ఎదుగుదలకు ప్రతిబంధంకం కాలేదు.  ఇలా సక్సెస్ అందుకుంటున్న హీరోయిన్లపై సర్వసాధారణంగా రక రకాల రూమర్లు రావడం వాటిని కొట్టిపడేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఎలా అయితే వస్తున్నాయో.. అదే విధంగా గాసిప్స్ కూడా ఆమెపై విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయం ఆమెని అడిగితే.. అసలు వాటిని పట్టించుకునే తీరిక నాకు లేదంటుంది.

 

తాజాగా తనపై వస్తున్న రూమర్లపై ఈ బ్యూటీ స్పందించింది.  ప్రతి హీరోయిన్‌కి వ్యక్తిగతంగా సమస్యలెదురవుతూనే ఉంటాయి. వారి మీద రోజుకొక వార్త వస్తూనే ఉంటుంది. అలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోను. లొకేషన్‌కు వెళ్లి షూటింగ్‌లో పాల్గొనడం, షెడ్యూల్స్‌ ప్లానింగ్‌తోనే సరిపోతుంది. ఒక్కో సమయంలో మనం తింటున్నామా.. లేదా అన్న విషయం కూడా మర్చిపోతుంటాం అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి గాలి వార్తల గురించి పట్టించుకునే తీరిక నాకు ఉండదు. అయినా వాటి గురించి అస్సలు బాధపడను. మొదట్లో కొంచెం బాధ అనిపించేది. తర్వాత్తరాత అలవాటైపోయింది.  నా గురించి ఎలాంటి వార్తలు వచ్చినా.. నా గురించి కాదులే అనుకుని.. నా పని నేను చేసుకుంటా..’’ అని రష్మిక తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: