కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు, హీరో నిఖిల్ గౌడ వివాహం అంటే అంగరంగ వైభోగంగా జరుపుతారిని అనుకున్నారు. నిఖిల్ హీరోగా కూడా నటించాడు.. దాంతో ఆయన పెళ్లికి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు హాజరవుతారని అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ అన్నట్టు కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని వ్యవస్థలు స్తంభించి పోయాయి. దాంతో ప్రైవేట్ ఈవెంట్స్ కూడా పర్సనల్ గా సింపుల్ గా కానిచ్చేస్తున్నారు. ఆ మద్య ఓ బీజేపీ నాయకుడు తన పుట్టిన రోజు హంగామా చేయడంతో అది కాస్త పోలీస్ కేసు అయ్యింది. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తంగా పెరిగిపోతోంది.
పాజిటివ్ కేసుల సంక్ష కూడా గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు తెలుగు హీరోలు నిఖిల్, నితిన్ తమ వెడ్డింగ్స్ని వాయిదా వేసుకున్నారు. అయితే కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం తన వెడ్డింగ్ని వాయిదా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు, హీరో నిఖిల్ గౌడ వివాహం కన్నడ పొలిటికల్ లీడర్ రేవన్న కుమార్తె రేవతితో జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది.
వివాహాన్ని ఏప్రిల్ 17న శుక్రవారం జరపాలని ముహూర్తం నిర్ణయించారు. కానీ పెళ్లి విషయంలో రాజీపడటానికి ఇష్టపడని కుమారస్వామి ఫ్యామిలీ తన కొడుకు నిఖిల్ వివాహాన్ని ఫామ్ హౌస్లో నిర్వహించాల నిర్ణయించుకుంది. ఈ రోజు ఉదయం బెంగళూరుతోని ఫామ్ హౌస్లో 7:30 గంటల నుంచే పెళ్లి పనుల్ని ప్రారంభించింది. ఉదయం 9:30 గంటలకు వివాహా తంతుని పూర్తి చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో 60 నుంచి 70 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్నారట. ఏది ఏమైనా ఈ సమయంలో ఆర్భాటాలకన్న ఆరోగ్యమే మిన్న అంటున్నారు.