కొన్ని కాంబినేషన్ ల లో సినిమా లు రావాలని  ఫ్యాన్స్ తోపాటు సినిమా లవర్స్ అందరు కోరుకుంటారు అందులో ఓ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు - ట్యాలెంటెడ్  డైరెక్టర్ హరీష్ శంకర్ ది. హీరో కు వున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కించడం లో హరీష్ స్టైల్ వేరు. అలాంటి దర్శకుడికి మహేష్ దొరికితే ఎలా వుంటుంది.  ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తొందరలోనే ఈకాంబో లో సినిమా రానుందని హరీష్ చెప్పేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాను త్వరలోనే  మహేష్ కు వినిపిస్తానని  తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. సో మహేష్ కు  స్క్రిప్ట్ నచ్చితే  సినిమా ఓకే  అవ్వడం ఖాయం. 
 
ఇక అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయబోయే  రెండో సినిమా గురించి కూడా స్పందించాడు హరీష్ శంకర్. ఫ్యాన్స్ కోరుకొనే అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా  ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్  ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పవన్ -హరీష్ కాంబో లో ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్  బ్లాక్ బాస్టర్ హిట్ కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. 
 
ఇక ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్  కొట్టిన మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ తో చేయనున్నాడు. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా  ఈ చిత్రం లాంచ్ కానుందని సమాచారం. జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. గోపి సుందర్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: