స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఇటీవల 'అల వైకుంఠపురం లో' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది.  అల్లు అర్జున్ కొన్నేళ్లుగా క‌న్న ఇండ‌స్ట్రీ హిట్ క‌ల‌ని నిజం చేసింది. ఈ సినిమా త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ఓ భారీ చిత్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ మూవీ గా రూపొంద‌నున్న ఈ  మూవీ  హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మించ‌నున్నారు.

 

ఇప్పటికే  నెక్స్ట్ సినిమా పనిలో పడ్డాడు త్రివిక్రమ్.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో  సినిమా ఒకే అయిపోయింది .  ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది. పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీ  జూన్ నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్లాన్ మారింది.  ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ఉండనుందని తెలుస్తుంది.

 

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లతో వరుసగా సినిమాలు చేయనున్నాడని అంటున్నారు.  ఎన్టీఆర్ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో ఫ్రీ కాబోతున్నారు. ఇన్ని నెల‌లు వేయిట్ చేయడం ఇష్టం లేని త్రివిక్ర‌మ్ `అఆ` త‌ర‌హా మూవీ  చేయాల‌ని  ప్లాన్ చేస్తున్నార‌ట‌.  గతంలో నితిన్ తో తీసిన మూవీ మంచి  హిట్ అయ్యింది . ఈ నేపథ్యంలో ఓ చిన్న సినిమా కు ప్లాన్ చేస్తున్నారు  త్రివిక్రమ్ శ్రీనివాస్ . అయితే మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అన్నదాని  పైన మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: