టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 2018లో తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ భరత్ అనే నేను. మహేష్ బాబు తొలిసారిగా ఒక ముఖ్య మంత్రి పాత్రలో కనిపించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ కొట్టి సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ ల రెండవ కాంబినేషన్ ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. కాగా ఆ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ భామ కియారా అద్వానీ. అంతకముందు బాలీవుడ్ లో ఎమ్ ఎస్ ధోని సినిమాలో నటించి మంచి పేరు దక్కించుకున్న కియారా అయితేనే మహేష్ ప్రక్కన బాగుంటుందని భావించి దర్శకుడు శివ ఆమెను ఎంపిక చేసారు. 

 

ఇక ఆ సినిమా అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమలో కూడా హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను తన అందంతో మురిపించింది కియారా. ఇకపోతే ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించనప్పటికీ బాలీవుడ్ ముద్దుగుమ్మ, అక్కడి ప్రఖ్యాత దర్శకుడు మహేష్ భట్ ముద్దుల తనయ అయిన ఆలియా భట్ కు, మన రెండు తెలుగు రాష్టాల్లో కూడా మంచి పేరుందనే చెప్పాలి. ఇటీవల గల్లీ బాయ్ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి అందరినీ మెప్పించిన ఆలియా, ఫస్ట్ టైం ప్రస్తుతం టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది ఆలియా. 

 

కాగా ఇటీవల కియారా, ఆలియా ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఇద్దరూ కూడా నిమ్మపండు రంగు డ్రెస్ వేసుకుని మంచి అదరగొట్టే ట్రెడిషనల్ లుక్ లో కనపడుతుండడం గమనించవచ్చు. ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే కియారా పూర్తి పేరు కియారా ఆలియా అద్వానీ కావడం. అంటే ఇద్దరూ కూడా ఆలియాలే అన్నమాట......!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: