వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు భీష్మ తో వచ్చి హిట్ కొట్టాడు యంగ్ హీరో నితిన్. ఫిబ్రవరి లో విడుదలైన ఈ చిత్రం 25కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈసినిమా డిజిటల్ లో విడుదలైతే మళ్ళీ చూడాలని నితిన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా శాటిలైట్ హక్కలను జెమిని టీవి దక్కించుకోగా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది.  ఈనెల 24న సన్ నెక్స్ట్ ఈసినిమా ను స్ట్రీమింగ్ లో తీసుకురావాలనుకుంది కానీ ఇప్పుడు ఒక రోజు ఆలస్యంగా  25న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది.
 
ఇక కరోనా వల్ల తన పెళ్లిని మూడు నెలలు వాయిదా వేసుకున్నాడు నితిన్. అంతేకాదు కరోనా పై పోరుకు తెలుగు రాష్ట్రాల సిఎం నిధులకు 10 లక్షల చొప్పున 20లక్షల విరాళం ప్రకటించాడు. టాలీవుడ్ నుండి  మొదటగా విరాళం ఇచ్చిన హీరో కూడా అతనే.. ఇదిలావుంటే నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు లో ఈ చిత్రం విడుదలకానుంది.
 
ఇక రెండోది.. సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నచెక్ (వర్కింగ్ టైటిల్) .. ప్రయోగాత్మక చిత్రం గా రానున్నఈ సినిమాలో నితిన్ ఖైదీ గా నటిస్తున్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలతరువాత నితిన్,అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: