టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆయన సినిమాలకి ఒక మార్కెట్ ఉంది. బద్రి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఎక్కడో దూరదర్శన్ లో సీరియల్ చేస్తున్న ఒక చిన్న దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా , ప్రొడ్యూసర్ గా, రైటర్ గా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థితరం చేసుకుంటాడంటే ఎవరైనా నమ్మగలరా ..సాధ్యం అవుతుందని ఊహించగలరా .. అదే పూరి జగన్నాధ్. ఆయన సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన హీరోలు చాలా డిఫ్రెంట్ గా ఉంటారు. హీరోయిన్ ఎలా ఉన్నా అద్భుతంగా చూపించగలరు. 

 

తన సినిమాలో ఒకసారి చేసిన హీరో మంచి మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. అంతేకాదు మంచి మార్కెట్ కూడా ఏర్పరచుకుంటాడు. అది పూరి తో సినిమా చేసిన హీరో గురించి చెప్పాలంటే. ఇండస్ట్రీలో ఒక దర్శకుడు సంపాదించలేనంత పేరును డబ్బును సంపాదించారు పూరి. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది సమయంలోనే ఓ 100 కోట్లు సంపాదించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. అలాగే ఇండస్ట్రీలో ఒక మనిషిని గుడ్డిగా నమ్మి తన సంపాదనకి సంబంధించిన అన్ని వ్యవహారాలు అప్పజెప్పాడంటే అది కూడా పూరి నే అని చెప్పాలి. అందుకే ఆయన సంపాదించినదంతా కాజేసి పూరి ని రోడ్డున పడేశాడు.

 

అయినా ఒక్క మాట అనలేదు. కన్నీళ్ళు మాత్రం పెట్టుకున్నాడు అది కూడా తను ప్రేమగా పెంచుకున్న కుక్క కి తిండిపెట్టలేక. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా పిచ్చోడవుతాడు లేదా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. కాని పూరి ఈ విషయం నుంచి చాలా నేర్చుకున్నాడు. అప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి కి ఇది చావుదెబ్బ. అయినా లెక్కచేయలేదు. మొండివాడంటే పూరి నే అందుకే మళ్ళీ కథ రాశారు. తన తమ్ముడినే హీరోగా పెట్టి 143 సినిమా తీశాడు ..హిట్ కొట్టాడు. అంతే మళ్ళీ పూరి ఈజ్ బ్యాక్. వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.

 

ఇక్కడ దర్శకుడిగా, రచయితగా కంటే నిర్మాతగానే జీవితం అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు. అందుకే నిర్మాత అనేవాడు నిద్ర మాత్రలు వేసుకుంటేనే పడుకోగలడు. అంటూ సొంత అనుభవాన్నే స్టేట్‌మెంట్ గా ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తూ, అలాగే కొడుకు ఆకాష్ పూరి తోను రొమాంటిక్ అనే సినిమాను నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: