కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోవడంతో సెలెబ్రెటీలు అంతా తమ ఇంటికే పరిమితం అయిపోయి తాము నటిస్తున్న సినిమాలకు సంబంధించిన తమ లుక్ విషయమై మరింత శ్రద్ధ పెడుతూ గంటల కొద్ది జిమ్ లో కాలం గడుపుతూ ఈ లాక్ డౌన్ గ్యాప్ వల్ల తమ బాడీ షేప్ ఏమాత్రం దెబ్బతినకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటూ సుకుమార్ పర్యవేక్షణలో బన్నీ చిత్తూరు యాస పై పూర్తి పట్టు సాధించదానికి ఈ లాక్ డౌన్ టైమ్ లో ఒక ట్యూటర్ దగ్గర ఆన్ లైన్ శిక్షణ కూడ బన్నీ తీసుకుంటున్నాడు. 


దర్శకుడు సుకుమార్మూవీ కథకు సంబంధించి మరింత మెరుగులు దిద్దుతూ మధ్యలో ఈ మూవీ పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడ దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా పాటలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఏ ట్యూన్ ను ఇంకా ఒకే చేయకుండా ఇంకా మంచి ట్యూన్ కావాలి అని దేవిశ్రీ పై బన్నీ ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. 


వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడుగా తమన్ ను ఎంపిక చేయమని బన్నీ మొదట్లోనే సుకుమార్ కు సూచించాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే సుకుమార్ ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఒక్క సినిమా కూడ చేయని పరిస్థితులలో దేవిశ్రీని పక్కకు పెట్టి తమన్ ను ఎంపిక చేసే ఉద్దేశ్యం తనకు లేదని మొదట్లోనే సుకుమార్ బన్నీకి స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు అని అంటారు. 


‘అల వైకుంఠపురములో’ తరువాత బన్నీకి ఏ సంగీత దర్శకుడు చేసిన ట్యూన్స్ నచ్చడం లేదని అనే అభిప్రాయం కూడా ఉంది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు దేవిశ్రీ ఎంత మంచి ట్యూన్స్ ఇచ్చినా బన్నీకి పూర్తిగా నచ్చక పోవడంతో ఈ విషయం పై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న టెన్షన్ దేవిశ్రీతో పాటు సుకుమార్ కు కూడఈ లాక్ డౌన్ పిరియడ్ లో పెరిగి పోతున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: