యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంతకముందు జాన్వీ కపూర్, పూజాహెగ్డే అన్నారు. ఇప్పుడు రష్మిక మదన్న అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నటించనున్నారట. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఈ సినిమాకి సంభందించిన న్యూ అప్డేట్ మే 20న వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. 

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీమ్ గా ఆయన ఇంట్రడక్షన్ వీడియో విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ పర్ రామరాజు' పేరుతో విడుదల చేసిన అల్లూరిగా చరణ్ ఇంట్రో వీడియో భారీ ఆదరణ దక్కించుకుంది. చరణ్ పరిచయ వీడియోకి ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ వీడియో 'రామరాజు ఫర్ భీమ్' ఉంటుంది అనడంలో సందేహం లేదు. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మే నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా త్రివిక్రమ్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ పోస్టర్ త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మే 20న దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: