ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో గిరాకీ బాగా పెరిగింది. తెలుగులో హిట్ అయిన చిత్రాలని హిందీలో రీమేక్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. బాహుబలి తర్వాత బాలీవుడ్ జనాల కన్ను తెలుగు సినిమాలపై పడింది. హిందీ చిత్రాలకి ధీటుగా తెరకెక్కిస్తున్న కథలకి బాలీవుడ్ జనాలు ఫిదా అవుతున్నారు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలని అక్కడ రీమేక్ చేస్తున్నారు.

 

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సంచలన విజయం సాధించింది. ఎన్టీఆర్ టెంపర్ సింబాగా రీమేక్ అయ్యి రణ్ వీర్ సింగ్ కి మంచి విజయాన్ని అందించింది. దాంతో ఇక్కడి నుండి బాలీవుడ్ కి వెళ్లే రీమేక్ ల సంఖ్య పెరిగింది. ఆర్ ఎక్స్ ౧౦౦, జెర్సీ, భాగమతి మొదలగు చిత్రాలన్నీ బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్తున్నాయి. అయితే తాజాగా మరో తెలుగు చిత్రం హిందీలో రీమేక్ కానుంది.

 


నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి నెల చివరి వారంలో విడుదలై విజయాన్ని అందుకుంది. చాలా రోజుల్ తర్వాత నితిన్ కి మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్ హీరోకి సరిపోయే కథ ఉంది కాబట్టి, మరో స్టార్ హీరోతో తీసుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు.

 

 

అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మొదటగా ఈ రీమేక్ లో రణ్ బీర్ కపూర్ నటిస్తాడని వార్తలొచ్చినా, తాజా  సమాచారం ప్రకారం అర్జున్ కపూర్ ఈ కథకి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: