నట సింహం బాలకృష్ణ కోసం చాలా మంది డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. బాలయ్యతో సినిమా చేయ్యాలని ఆరాటపడుతున్నారు. కొంత మంది స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని ఎదురు చూస్తుంటే.. ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ఈ లాక్ డౌన్ టైమ్ లో బాలయ్య బాబుకోసం మంచి మసాల కథను తయారు చేస్తున్నాడు.

 

రెండేళ్ళుగా హిట్ సినిమా లేదు బాలకృష్ణకు. తీసిన సినిమా తీసినట్టు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే నటసింహం కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మంచి మాస్ కథలతో బాలకృష్ణను సినిమాకు ఒప్పించాలని చూస్తున్నారు. ప్రస్థుతం బాలయ్య బాబు కూడా సాహసం చేశాడు.... ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోన్న బోయపాటితో సినిమాకు రెడీ అయ్యాడు. ప్రస్థుతం షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయ్యింది మూవీ షెడ్యూల్.

 

బాలకృష్ణ చాన్స్ ఇస్తే మరోసారి అద్భుతమైన హిట్ ఇస్తాను అంటున్నాడు  డైరెక్టర్ బీ.గోపాల్. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు లాంటి మస్ సినిమాలతో బాలకృష్ణ ఇమేజ్ పెంచిన గోపాలు ప్రస్థుతం బాలయ్యతోసినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ మూవీకోసం బుర్రా సాయిమాధవ్ తో బి.గోపాల్  కథను కూడా రెడీ చేయించినట్టు తెలుస్తోంది. బోయపాటితో సినిమా తరువాత ఈ సినిమానే పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

 

ఇక బాలయ్య బాబుతో సినిమా కోసం తహతహలాడుతున్నాడు   యంగ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్.. బాలకృష్ణతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కథ కూడా రెడీగా ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే స్టార్ హీరో ఈ ఆఫ్షన్ ను తీసుకుంటాడో లేదో చూడాలి. మరి అనిల్ కు ఛాన్స్ ఎప్పుడిస్తాడో చూడాలి.

 

ఇక బాలకృష్ణ కోసం మరోసారి పూరీ జగన్నాథ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా అన్ని కంప్లీట్ గా  ఖాళీ అయినా సందర్భంలో .. ఇంట్లో ప్రశాంతంగా కూర్చోని  బాలయ్య కోసం ఓ మంచి కథను రెడీ చేస్తున్నాడట పూరీ జగన్నాథ్. ఇంత కు మందు వీరి కాంబోలో తెరకెక్కిన సినిమా పైసా వసూల్ . ఈ మూవీ హిట్ కాకపోయినా.. పూరీ మార్క్ హీరోయిజాన్నీ బాలయ్య లోచూసి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. అందుకే మళ్లీ మళ్లీ ఈ కాంబినేషన్ ని చూడాలనుకుంటున్నారు. సో.. హిట్లు పెద్దగా లేని హీరో కోసం  హిట్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: