సూపర్ స్టార్ మహేష్ తన 27వ సినిమా పరశురామ్ డైరక్షన్ లో చేస్తాడని తెలిసిందే. అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయి.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనెంట్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు భామల పేర్లు వినపడుతున్నాయి. అందులో ఒకటి కీర్తి సురేష్ కాగా.. మరొకరు కియరా అద్వానీ. మహానటి తర్వాత కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక కియరా అద్వాని కూడా భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. 

 

పరశురామ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవసరం ఉండగా ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే మహేష్ సినిమాలో కియరా బదులుగా సాహో భామ శ్రద్దా కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రద్ధా కపూర్ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాలో నటించి మెప్పించింది. సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. 

 

ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేందుకు వస్తుందట శ్రద్ధా కపూర్. బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమా అనగానే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. బాలీవుడ్ లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా సౌత్ సినిమా అనగానే ఎక్కువ డిమాండ్ చేస్తారు. అయితే శ్రద్దా వాళ్లకు డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. సౌత్ లో కూడా తన పాగా వేయాలని చూస్తుంది. సాహో తెలుగులో పెద్దగా ఆడకపోయినా మహేష్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తుందని అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: