ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో రీమేక్ సినిమాల హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తుంది. అయితే ఇటీవ‌లె మలయాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లూసిఫర్’ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కుల్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా దర్శనమివ్వనున్నాడని స‌మాచారం.

 

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘లూసిఫర్’ కోసం ఆ చిత్ర ద‌ర్శ‌కుడు, ప్ర‌ముఖ న‌టుడు పృథ్వీరాజ్ కూడా సుకుమారన్ ఓ ముఖ్య భూమిక పోషించాడు. అయితే ఈ చిత్రంలో మోహన్ లాల్‌కి నమ్మిన బంటుగా ఉండే జాయద్ మసూద్ పాత్రలో పృథ్వీ న‌ట‌న సినిమాకే హైలెట్‌గా నిలిచింది. కాగా, తెలుగులో ఈ పాత్ర‌కి బన్నీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌తో పాటు చిరు కూడా భావిస్తున్నారని స‌మాచారం. అదే సమ‌యంలో బన్నీ కూడా ఈ పాత్రలో నటించడానికి సుముఖంగానే ఉన్నార‌ట‌. అంతేకాక మావ‌య్య క‌లిసి న‌టించ‌డం అంటే ఎవ‌రు కాద‌నుకుంటారు. బ‌న్నీ ఇది ఒక‌ర‌కంగా చెప్పాలంటే మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి.

 

గ‌తంలో చిరు క‌థానాయ‌కుడుగా న‌టించిన ‘విజేత’, ‘డాడీ’, ‘శంక‌ర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాల్లో త‌ళుక్కున మెరిసాడు బ‌న్నీ. కానీ ఆ చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా పేరు రాలేదు. ఈ నేప‌థ్యంలో.. సుదీర్ఘ విరామం త‌రువాత చిరుతో మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండ‌డం ఆస‌క్తి క‌లిగించే అంశ‌మే. త్వ‌ర‌లోనే బన్నీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మ‌రి ఈ కాంబినేష‌న్ క‌నుక తెర మీద వ‌స్తే ఇక మెగా ఫ్యాన్స్‌కి పండ‌గ‌నే చెప్పాలి. క‌రోనా అయిన త‌ర్వాత కొర‌టాల చిత్రం అవ్వ‌గానే సుజిత్ మూవీతో బిజీ అవ్వ‌నున్నారు చిరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: