ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలు వ్యాపించి అనేక మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 22 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతే ముందున్న మార్గాలుగా కనిపించడంతో పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో నిత్యవసర సరుకులు మినహా మిగిలినవన్నీ బంద్ అయ్యాయి.
అలాగే ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. మరియు షూటింగ్స్ లేక సెలబ్రేటీలు సైతం ఇంట్లో ఉంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ మీరోయిన్ పూజా హెగ్డే.. తన తండ్రి కోసం చాక్లెట్ కేక్ తయారు చేసింది. ఎందుకంటే.. పూజా హెగ్డే తండ్రి మంజునాథ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా బేకరీలు కూడా బంద్ కావడంతో కేక్లు దొరకని పరిస్థితులు నెలకొంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఎలాగైన తండ్రి కోసం కేక్ తయారు చేయలనుకుంది. అందుకే తండ్రి కోసం పూజా మాస్టర్ చెఫ్గా మారి చాక్లెట్ కేక్ తయారు చేసింది.
శనివారం బర్త్డే కావడంతో నిన్న రాత్రే తన తండ్రితో కట్ చేయించింది. ఈ క్రమంలోనే ఈ కేక్కు సంబంధించిన ఫోటోలను ఈభామ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మరియు తండ్రి కేక్ కట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో తండ్రిపై ఆమెకున్న ప్రేమకు మరియు ఆమె చేసిన కేక్కు నిటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఇప్పటికే గజార్ కాహాల్మా, పిజ్జాను ఆమె తయారు చేసిన విషయం తెలిసిందే. కాగా, పూజా సినిమా విషయానికి ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం ప్రభాస్ 20 సినిమాలో నటిస్తుంది. అలాగే అఖిల్ చిత్రంలోనూ నటిస్తుంది.