రమ్యకృష్ణ కు మన తెలుగులో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. నరసింహ సినిమా లో ఆమె చేసిన పాత్ర అయినా హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు అయినా సరే రమ్యకు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆమె సినిమా వస్తుంది అంటే కొంత మంది అబ్బాయిలు అప్పట్లో సినిమాల కోసం కాలేజి లు మానేసి పనులు మానేసి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి. ఆ విధంగా రమ్య తన ప్రభావం చూపించింది అప్పట్లో అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమెకు బాహుబలి సినిమా తర్వాత తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆమె తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఏ సినిమా అయినా సరే కీలక పాత్ర అంటే చాలు రమ్య అనే పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతుంది. అందుకే ఇప్పుడు రమ్య ఎక్కువగా రేటు పెంచింది అని సమాచారం. ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు అని అంటున్నారు టాలీవుడ్ జనం. ఇటీవల మహేష్ బాబు సినిమా కోసం గానూ ఆమెను అడిగింది చిత్ర యూనిట్... 

 

దీనితో ఆమె దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక ఎప్పుడు షూటింగ్ కి వస్తాను అనేది కూడా ఆమె స్పష్టంగా చెప్పడం లేదని అక్కడ తమిళంలో సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సినిమాలకు తాను స్పష్టత ఇవ్వలేను అని ఆమె చెప్పినట్టు టాలీవుడ్ లో ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఆమెతో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు వెనక్కు తగ్గి ఆమెను పక్కన పెట్టారని టాలీవుడ్ జనం అంటున్నారు. ప్రస్తుతం రమ్య తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: