నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని ముగ్గురు నలుగురు దర్శకులతో స్టోరీ డిస్కషన్స్ పెట్టాడు. అందులో కృష్ణవంశీ రైతు సబ్జెక్ట్ కూడా ఉంది. ఆ సినిమానే తన 100వ సినిమాగా చేయాలని అనుకున్నాడు బాలయ్య బాబు. అయితే ఆ సినిమాలో రాష్ట్రపతి పాత్రలో బిగ్ బి అమితాబ్ ను ఒప్పించాలని బాలకృష్ణ, కృష్ణవంశీ ముంబై దాకా వెళ్లారు. డైరక్టర్ చెప్పిన కథ విన్న అమితాబ్సినిమా చేయనని సున్నితంగా తిరస్కరించాడు.  

 

అమితాబ్ చేసి ఉంటె ఆ సినిమానే బాలకృష్ణ వందవ సినిమా అయ్యేది. అయితే ఎప్పటికైనా సరే బాలయ్యతో రైతు సినిమా చేస్తా అని అంటున్నాడు కృష్ణవంశీ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమా డైరెక్ట్ చేస్తున్న కృష్ణవంశీ ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరాఠీలో సూపర్ హిట్ అయినా నటసామ్రాట్ రీమేక్ గా రంగమార్తాండ సినిమా వస్తుంది. ప్రకాష్ రాజ్ తో పాటుగా క్రేజీ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య బాబు వందవ సినిమా క్రిష్ డైరక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేశాడు. కెరియర్ లో ప్రత్యేకస్థానంలో ఉండేలా శాతకర్ణి మూవీ తెరకెక్కించాడు క్రిష్. 

 

ఇక ఆ నమ్మకంతోనే క్రిష్ కు ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యత మీద పెట్టాడు బాలకృష్ణ. అయితే దురదృష్టవ శాత్తు ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ సినిమాతో క్రిష్ కెరియర్ పరంగా వెనకపడ్డాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు క్రిష్. సినిమాకు ఆల్రెడీ ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వకీల్ సాబ్ రిలీజ్ కాగానే పవన్, క్రిష్ సినిమా షూటింగ్ కు వెళ్తుంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: