సినీ ఇండస్ట్రీకి మంచు మోహన్ బాబు వారసులుగా పరిచయమైన విష్ణు మనోజ్ లు మొదటి నుండి తమదైన శైలిలో చిత్రాలలో నటిస్తూ వస్తున్నారు. మంచు విష్ణు 'ఢీ', దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు 'దొంగా దొంగది' సినిమాతో వెండితెరకు పరిచయమైన మంచు మనోజ్ ప్రయాణం, బిందాస్, వేదం, పోటుగాడు చిత్రాల ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి కమర్షియాలిటీ వైపు పరుగులు తీయకుండా కథాబలం ఉన్న చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు.

 

ప్రస్తుతం మంచు హీరోలు విష్ణు, మనోజ్ పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. మంచు విష్ణు హీరోగా దర్శకుడు జెఫ్రిన్ తెరకెక్కిస్తున్న 'మోసగాళ్లు' చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మనోజ్ కూడా 'అహం బ్రహ్మాస్మి' అనే ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల ద్వారా మంచు హీరోలు తమ మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో నిర్మితమవుతున్న అన్ని చిత్రాలు దాదాపు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అన్నదమ్ములిద్దరూ కూడా అదే ప్లాన్ లో ఉన్నారు. 

 

IHG's film is 'Mosagallu' -

 

ఇదిలా ఉండగా మంచు విష్ణు కొన్నిరోజుల క్రితం భక్త కన్నప్ప సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. పౌరాణిక గాథగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐతే ఈ సినిమా బడ్జెట్ 90కోట్ల వరకు ఉంటుందని మంచు విష్ణు చెప్పడం జరిగింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప మూవీ కోసం అంత బడ్జెట్ కేటాయించడం అంటే రిస్క్ అనే చెప్పాలి. మంచు విష్ణు మార్కెట్ అంచనా వేసి చూస్తే భక్త కన్నప్ప చిత్రంతో ఆయన పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క. మరి ఈ మంచు హీరోల ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: