మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రూమర్ ఏదైనా వచ్చింది అంటే అది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో గొడవల గురించి అవ్వచ్చు. చాలాసార్లు మేము అందరం బాగా ఉన్నాము అని చెప్పినా సరే ఏదో ఒక రకంగా రూమర్ పుట్టుకొని వస్తుంది.. ప్రత్యేకంగా చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వస్తూనే ఉంటాయి. ఈ విషయంపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అనేకసార్లు క్లారిటీ ఇచ్చారు కూడా. మెగా బ్రదర్స్ మేమందరము ఒకటే ఎప్పటికీ అలానే ఉంటాము అని ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన కూడా రూమర్లు ఆవిడ మాత్రం ఉండదు.

 

 

ఇలా కొన్ని రోజులు రూమర్లు రాకుండా ఆగిపోయి ఉంటే... ఏదైనా సినిమా రిలీజ్ అవడంతో ఆ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ హాజరు అవ్వకపోతే మళ్ళీ మొదలవుతాయి. ఇటీవల చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి రూమర్స్ ఎందుకు పుడుతాయో...? ఎవరు పుట్టిస్తారో...? కూడా అర్థం కాకుండా ఉంటుంది అని అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి. ఏదో ఒక పోస్ట్ పెడుతూ తన అభిమానులను అలంకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు చాలా ఫోటోలు, వీడియోలు మూమెంట్స్ సోషల్ మీడియా ద్వారా అందించిన చిరంజీవి. తాజాగా మెగా బ్రదర్స్ కి ఉన్న బాండింగ్  తెలియజేయడానికి  సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయడం జరిగింది. 

 


ఈ పోస్టుకు ముందు ఒక ఆదివారం దగ్గరైన వారిని కలవడం మిస్ అవుతున్న మీకి కూడా ఇలాంటి ఫీలింగ్ ఉందా నేను అమ్మ, తమ్ముడు, చెల్లెలు.. అంటూ క్యాప్షన్ పెట్టి తన కుటుంబ సభ్యుల ఫోటోలు చిరంజీవి షేర్ చేయడం జరిగింది. ఇక ఈ ఫోటోలో చిరు, నాగబాబు, పవన్, అమ్మ, చెల్లెలు ఉండడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: