ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు చాలా క్రేజ్ ఉంది అని తెలిసిన విషయమే కదా. ఇటీవల " సరిలేరు నీకెవ్వరు " సినిమా అనంతరం మహేష్ బాబుతో సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు బాగా పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. వరుసగా మూడు సినిమాలు మహేష్ బాబుకి మంచి హిట్ ఇవ్వడంతో భారీగా డిమాండ్ పెరిగిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్ని షూటింగ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. కనుక కరోనా ప్రభావం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.

 


ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మహేష్ కు చాలా ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా హీరోయిన్ కోసం ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లను సినిమా యూనిట్ పరిశీలించడం జరిగింది.

 


మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్ తీసుకోవాలనుకున్నారు... కానీ కీర్తి సురేష్ నేను చెయ్యను అని చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఇక శ్రద్ధా కపూర్ ప్రభాస్ జంటగా సాహో సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాతో తన లక్ ని పరీక్షించుకోవాలని శ్రద్ధాకపూర్ భావిస్తోంది అని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా చేయడం కోసం శ్రద్ధాకపూర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా కోసం రీ షూట్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: