టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలకు అతీతంగా ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. దర్శకుడిగా పూరీ 19 వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. పూరీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం బద్రి 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలైంది. పూరీ దర్శకుడిగా 20వ వసంతంలోకి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ జోహాన్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. పూరీ జగన్నాథ్ దర్శకునిగా మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని పేర్కొన్నారు. కరణ్ జోహార్ చేసిన ట్వీట్ కు నటి ఛార్మీ కౌర్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కరణ్ జోహాన్ పూరీకు ట్వీట్ పెడితే ఆ ట్వీట్ కు ఛార్మీ స్పందించి పూరీపై ఉన్న అభిమానాన్ని ఛార్మీ బహిరంగంగా వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు ఫన్నీగా కరణ్ మెసేజ్ కు రిప్లై ఇచ్చి ఛార్మీ దొరికిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి పూరీ, ఛార్మి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వేరువేరుగా కెరీర్ స్టార్ట్ చేసిన పూరీ, ఛార్మీ జ్యోతిలక్ష్మి సినిమా నుంచి సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా మారారు. వీరి కాంబినేషన్ కు టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉంది. ఇటీవల వీరిద్దరూ నిర్మాతలుగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా తెరకెక్కించనున్నారు.
ఫైటర్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి వీరిద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ వీరిద్దరి గురించి ఏదో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. గతంలోనే ఈ గాసిప్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ స్పందించినా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇలా పూరీ ట్వీట్లకు ఛార్మీ రిప్లై ఇస్తూ ఉండటంతో మారోసారి పూరీ, ఛార్మీ గురించి గాసిప్స్ వినిపిస్తున్నాయి.
Congratulations puri Sir! Tremendous love and respect for your blockbuster journey!🙏🙏❤️❤️ https://t.co/LD4w1DsZuz
— karan johar (@karanjohar) April 19, 2020