టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఓ పక్క కరోనాతో ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఈ భామ వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృస్టిస్తున్నాయి. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకి నిప్పంటుకోలేదని మరొకరు అన్నారట. రోజు రోజుకి కరోనా బాధితులు ఎక్కువయిపోతున్న నేపధ్యంలో దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు తలలు బాదుకుంటున్నాయి. ఎంతో కష్టపడి ఏం చేయాలో అర్ధం కాక లాక్డవున్లో కూడా ప్రజలెవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెండు రాష్ట్రాలు కష్టపడి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే... లాక్డౌన్ కారణంగా చాలా మందికి పనిలేక పూటగడవడం కష్టమయిపోతుంది. దాంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక లేనోడి తిప్పలు వర్ణనాతీతం అని చెప్పాలి. ఉన్న వాడి సంగతి తెలిసిందే. ఇష్టమైనవన్నీ వండుకుని తినండం వండేటప్పుడు వీడియోలు తీసి అప్లోడ్ చేయడం వంటి పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇక లేనివాళ్ళు ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా?? ఎలా కష్టపడి కాయాకష్టం చేసుకుని కడుపు నింపుకుందామా? అని కొందరు ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే లాక్ డౌన్ని ఉన్నోళ్లు ఒకలా స్వీకరిస్తే లేనివాళ్ళు మరొకలా స్వీకరిస్తున్నారు మొత్తానికి ఇబ్బందులైతే పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇంతేనా.. అంతకు మించిని ముచ్చట మరోటి ఉందంటూ రంగంలోకి దిగింది ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.
అందరి బాధలు ఒకలా ఉంటే.. ఈమె మాత్రం వెరైటీగా స్పందిస్తది. ‘ఈ క్వారంటైన్లో తిండి లేక ఆకలితో చచ్చిపోయే వారి శాతం కంటే కూడా సెక్స్ ఆకలితో చచ్చిపోయే వారే ఎక్కువ అంటూ సెక్స్ క్వారంటైన్ ప్రవచనాలు మొదలెట్టింది శ్రీరెడ్డి. జనాలు సెక్స్ కోసం పరితపిస్తున్నారని ఆమె ఫేస్ బుక్ ద్వారా కామెంట్లు పెడుతుంది. మీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్కి RIP అంటూ ఫేస్ బుక్లో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. అంతేకాదు..వేరే పోస్ట్లో సైతం.. లైంగిక స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ కామెంట్లు పెట్టింది. ఇక ఆమె ఈ క్వారంటైన్లో సెక్స్లేక ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసు అంటోంది. సెక్స్ కోసం ఇబ్బంది పడుతున్నవారిని స్వయంగా తానే దగ్గరుండి చూసినట్లు ప్రవచనాలు చెబుతోంది ఈ భామ.