దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న స్టార్ హీరోయిన్లు ఆ విశేషాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. 
 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ముంబైలో తన ఇంటిలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటంతో పాటు వంట పనిలో బిజీ అయ్యారు. ప్రస్తుతం వంటింట్లో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మానాన్న కోసం ఉసిరికాయ జ్యూస్ తయారు చేస్తున్నానని దీని వల్ల సి విటమిన్ పెరుగుతుందని చెబుతున్నారు. 
 
ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నిధి అగర్వాల్ లాక్ డౌన్ తన జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చిందని... జీవితానికి ఏది ముఖ్యమో బాగా అర్థమైందని చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల నేరాలు తగ్గాయని.... బయట కాలుష్యం కనిపించడం లేదని.... పక్షుల శబ్దాలు మనుషులకు ప్రశాంతత కలిగిస్తున్నాయని చెప్పారు. 

 
మరో టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా తాను కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించడం లేదని ఫిర్యాదు ఉండేదని.... లాక్ డౌన్ వల్ల ఆ ఫిర్యాదు పోయిందని చెప్పారు. కరోనా విపత్తు తర్వాత సాటి మనిషికి సాయం చేయాలనే అలవాటు మరింత బలపడిందని చెప్పారు. ఇంట్లో అందరూ సురక్షితంగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. 
 
రియల్ లైఫ్ లో కూడా 50 కుటుంబాలకు సహాయం చేసి హీరోయిన్ అనిపించుకున్న ప్రణీత ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడే మనుషులంతా ఒక్కటే తెలుస్తుందని అన్నారు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఆకలి తీర్చేది గుప్పెడు మెతుకులేనని చెప్పారు. 

 

మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని... అదే విధంగా సోషల్ డిస్టన్స్ పాటిస్తానని చెబుతున్నారు. కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న వాళ్ల కష్టాలు చూస్తే కళ్లు చెమరుస్తాయని... వారికి భరోసా ఇవ్వాల్సిన సమయం ఇదే అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: